“సీఎం పదవిపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు”

-

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణములో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాల గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడుతూ… గతంలో టీడీపీ మరియు బీజేపీ కి మద్దతు ఇవ్వడంలో రాష్ట్ర ప్రయోజనాలు దాగున్నాయని చెప్పారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఆలా జరగలేదు అంటూ పవన్ నిరాశను చూపించారు. అందుకే రానున్న ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ టీడీపీ తో కలిసి నడిచి ప్రభుత్వాన్ని మారుస్తామంటూ పవన్ మాట్లాడారు. టీడీపీ మరియు జనసేన లు కలిసి పోటీ చేయనున్న సందర్భంలో , జనసేన నిలబడిన స్థానాలలో గెలిపించి బలాన్ని మరింతగా పెంచే బాధ్యత మీ మీదే ఉందంటూ పవన్ ప్రజలకు తెలియచేసారు. ఎప్పుడైతే మీరు నాకు ఎక్కువ స్థానాలను కట్టబెడతారో అప్పుడే నేను సీఎం పదవి కావాలని అడుగుతాను అంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు.

ఇక ఫైనల్ గా అధికారం మన కూటమికి వస్తే నేను మరియు చంద్రబాబు నాయుడు కలిసి సీఎం ఎవరన్నా విషయంపై నృణాయం తీసుకుంటామంటూ తెలిపారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news