కేసీఆర్ అండ్ కో కు ఇక “బ్యాండ్ బాజా బారాతే” !

-

తెలంగాణాలో మొన్న జరిగిన ఎన్నికల్లో ముందు నుండి అందరూ అనుకున్నట్లే కాంగ్రెస్ పూర్తి మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చింది. ఇక ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వారం రోజుల క్రితం తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు మాజీ అయిపోయి ఇంటికి పరిమితం అయ్యాడు. ఇక కాంగ్రెస్ పాలనలో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తారన్న విషయాన్ని పక్కన పెడితే, ఇక కేసీఆర్ అండ్ టీం కు జైలుకు వెళ్ళడానికి రోజులు దగ్గర పడినట్లే లెక్క అని చెప్పాలి. అందులో భాగంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన జరిగిన అవినీతి గురించి సిబిఐ కి ఫిర్యాదు చేశారు. వాస్తవంగా తెలిసిన సమాచారం ప్రకారం కాళేశ్వరం లో కోట్ల అవినీతి జరిగింది.

ఇప్పుడు కేసీఆర్ అండ్ టీం కు రేవంత్ రెడ్డి పాలనలో బ్యాండ్ బాజా బారాత్ మొదలైనట్లే అంటూ రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. మరి వీరి దాటికి కేసీఆర్ అండ్ టీం తట్టుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news