చంద్రబాబు కంట తడి.. సిఎం జగన్ పై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ !

-

చంద్రబాబు ఎపిసోడ్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కుటుంబ సభ్యులను కించపరచటం తగదని… ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజా ప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఆమోదయోగ్యంకాని విమర్శలు, వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు.

తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉందని.. ఈ మధ్యకాలంలో సభలు, సమావేశాలు చర్చల్లో కొన్నిసార్లు వాడుతున్న పదజాలం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయమని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు నిర్హేతుకంగా ఖండించదగినవని.. సీఎం జగన్ కుటుంబసభ్యులను తక్కువ చేసి కొందరు మాట్లాడినప్పుడు ఆనాడు కూడా ఆ వ్యాఖ్యలను ఇదే రీతిలో ఖండించామని తెలిపారు. ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news