జాగ్రత్తగా ఉండు బిడ్డా.. రేగా కాంతారావుకు పాయం వార్నింగ్

-

తెరాస మాజీ ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు..సంచలన వ్యాఖ్యలు చేసారు. పోడు భూముల పై ఆదివాసీలను, ఫారెస్ట్ అధికారుల పై దాడులు చెయ్యండి అంటూ రెచ్చగొట్టిన ఎమ్మెల్యే రేగా. వ్యాఖ్యలను పాయం ఖండించారు. పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు అన్ని ప్రాంతాల్లో ట్రెంచ్ లు కొడుతుంటే రేగా ఎం చేశాడు… ఎంతమంది కి పట్టాలిచ్చారో ఎమ్మెల్యే రేగా దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేశారు.

తమ నాయకుల పై అవాక్కులు, చేవాక్కులు పేలితే దానికి ఎం చెయ్యాలో చేస్తామని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండు బిడ్డా రేగాకు పాయం హితవు పలికారు. గులాబీ కండువా కప్పుకొని మాట్లాడడానికి సిగ్గుండాలి… తెలంగాణ ఉద్యమం లో ఎం చేశావు…మేము ఉద్యమాలు, పోరాటాల తో పాటు జెళ్లు కెళ్ళాం..రాజీనామాలు చేశామని గుర్తు ఛేసారు.

నాడు కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేశి ఉద్యమం లో పాల్గొంటే నువ్వు కాన్వాయ్ లో తిరిగావ్…. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ని అంతు చూశాక దాకా వొదిలిపెట్టామని వార్నింగ్ ఇచ్చారు.. పినపాక లో ఎవరు అభివృద్ధి చేశారో తెల్చుకుందాం..రేగా కు సవాల్ విసిరారు పాయం.

Read more RELATED
Recommended to you

Latest news