టాలీవుడ్ నిర్మాత ఇంట తీవ్ర విషాదం

-

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ కన్ను మూయగా ఈరోజు ప్రముఖ నిర్మాత పి.డి.వి ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ కొద్ది సేపటి క్రితం గుండె పోటు వల్ల మరణించారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ లోని కిమ్స్ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న ఆమె ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారని మీడియాకి సమాచారం అందింది.

ఆమె వయసు 53 సంవత్సరాలు. పిడివి ప్రసాద్ టాలీవుడ్ లో ఇప్పుడు లీడింగ్ లో ఉన్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించే సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ సినిమాలకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రసాద్ సమర్పణలో సూపర్ హిట్ సినిమాలు అ ఆ, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, భీష్మ, లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ విషయాన్నీ ఈ రెండు బ్యానర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Latest news