కేసీఆర్ భాషను చూసి జనం చీదరించుకుంటున్నారు: మంత్రి జూపల్లి కృష్ణారావు

-

మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటైన విమర్శలు చేశారు.కేసీఆర్ భాషను చూసి జనం చీదరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ…కేసీఆర్ భాషను చూసి ప్రజలే తిరగబడతారని అన్నారు.కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయటానికి కేటీఆర్ కు బుద్ధి ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేసి తెలంగాణ తెస్తే కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని మంత్రి జూపల్లి అన్నారు.2009లో రాహుల్ కి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించారని ఈ సందర్భంగా తెలిపారు.త్యాగాలు అంటే గాంధీ ఫ్యామిలీవే అని అన్నారు జూపల్లి. కేసీఆర్ అవినీతికి సాక్ష్యం కవిత జైలుపాలు కావటమే అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news