కెసిఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు – తరుణ్ చుగ్

-

సీఎం కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని తెలిపారు తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. కెసిఆర్ అవినీతితో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తరుణ్ చుగ్. మిషన్ 90 పేరుతో 10 నెలల రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ లో ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిజెపి గెలుపుకు ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బిజెపి బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది. జనవరి 16 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గాల పర్యటన తర్వాత బస్సు యాత్రకు ప్రణాళికలు రెడీ చేస్తుంది. బండి సంజయ్, బిజెపి సీనియర్ నేతలు వేరువేరుగా యాత్రలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలలో బస్సుయాత్ర ఉండేలా బిజెపి కార్యచరణ రూపొందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news