జైలులో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతి

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. జైలులో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. చంద్రబాబు రూమ్ లో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు చర్మ సంబంధించి వ్యాధి వచ్చిన తరుణంలోనే.. చంద్రబాబు రూమ్ లో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది.

కాగా రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరింది. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయ్యారు చంద్రబాబు. ఇక ఈ నెల 19వ తేదీ వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించి కోర్టు. అటు ఏసిబి కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏ.సి ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబుకు చర్మ సమస్యలు దృష్ట్యా ఏ.సి. ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news