కడుపు మంట తో చంద్రబాబు పోయేలా ఉన్నారు : పేర్నినాని

-

బట్టలు, బూట్లు ఇప్పకుండా పుష్కర స్నానం చెయ్యడం….ప్రాణాలు పోవడానికి కారణం అవ్వడం మానవ తప్పిదమ‌ని పేర్నినాని వ్యాఖ్యానించారు. వరద బాధితుల వద్దకు వెళ్లి నాభార్యను అన్నారు అని చంద్రబాబు గోల చేస్తున్నారంటూ పేర్నినాని మండి ప‌డ్డారు. కడుపు మంట తో చంద్రబాబు పోయేలా ఉన్నారు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక సీఎం ను…మాజీ సీఎం గా ఉన్న వ్యక్తి గాల్లో కలిసి పోతావ్ అని ఎలా అంటారు! అంటూ పేర్నినాని ప్ర‌శ్నించారు. అసెంబ్లీ ఘటన ను మరుగున పడేయ్యాడానికి…అన్నమయ్య ప్రాజెక్ట్ కు ప్రభుత్వమే బాంబులు పెట్టింది అనలేదు….సంతోషం అంటూ పేర్నినాని వ్యాఖ్యానించారు.

సినిమా టిక్కెట్ల పై చిరంజీవి అభిప్రాయాన్ని చర్చిస్తామ‌ని తెలిపారు. సీఎం తో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ ఆయ‌న హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందని…వరద బాధితుల దగ్గరకెళ్లి మీ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటూ నాని ప్ర‌శ్నించారు. మా ఆవిడను తిట్టారని బాధితుల దగ్గర ఏడుపు ఎందుకు..? అంటూ ప్ర‌శ్నించారు. మీ శ్రీమతిని మేము ఏమీ అనలేదని లబోదిబోమంటున్నామ‌ని…నిన్ను తిడతాం గానీ…మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతాం? అంటూ చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news