మల్లె సాగులో పురుగు ఉద్ధృతికి నివారణ చర్యలు..?

-

దేవుడి పూజ చేయాలంటే మల్లెపూల దండ ఉండాల్సిందే.. ముత్తైదువు జడలో మల్లెపూలు మెరవాల్సిందే.. మాంచి పర్ఫ్యూమ్ తయారు చేయాలంటే మల్లెపూలు కావాల్సిందే. ఇలా మల్లెపూలు అలంకరణలోనే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ పూలకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే రైతులు మల్లెసాగు వైపు ఆసక్తి చూపి అద్భుతమైన లాభాలు పొందుతున్నారు.

సాధారణంగా నాటిన రెండో సంవత్సరానికి మల్లె పూతకు వస్తుంది. మల్లె మొగ్గ దశలో వివిధ రకాల పురుగులు ఆశించి పూల దిగుబడి నాణ్యతను పై తీవ్ర ప్రభావం చూపుతాయి. నాణ్యమైన మల్లెపూల దిగుబడి పొందడానికి కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అవేంటంటే..?

ఎండు తెగులు : ఈ తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి కోమ్మలు ఏంటి పోయి చివరికి మొక్క చనిపోతుంది.ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు , లీటరు నీటికి కలిపి మొక్క మొదలులో పోయాలి.

మొగ్గ తొలుచు పురుగు: మల్లె మొగ్గ దశలో ఈ పురుగులు తీవ్రంగా నష్టపరుస్తాయి.తల్లి పురుగు మొగ్గలపై మొగ్గ కాడలపై గ్రుడ్లను పెట్టడం వల్ల ఈ పురుగు లార్వాలు మొగ్గలోకి చొచ్చుకొనిపోయి పూల భాగాలను తినడం వల్ల మొగ్గలు ఎండిపోయి రాలిపోతాయి. ఈ పురుగు నివారణకు మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

స్టింక్ బగ్ : ఈ పురుగులు మొక్కలేత భాగాల నుంచి, పూల నుంచి రసాన్ని పీల్చటం వలన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఈ పురుగు ఆశించడం వల్ల పూల నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణకుమలాథియాన్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా మిన్ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

నల్లి : పొడి వాతావరణంలో నల్లి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది.ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల మీద, లేత కొమ్మల మీద, మొగ్గలపై తెల్లటి వెంట్రుకలతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణకు గంధకపు పొడిని ఎకరానికి 8-10 కిలోల చొప్పున చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news