కేయూడబ్ల్యూజే వేసిన పిటిషన్ వాయిదా…!

-

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్ ఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్లిన సిద్ధిఖీ కప్పన్ అనే జర్నలిస్టును హథ్రస్ టోల్‌ప్లాజా వద్ద యూపీ పోలసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే జర్నలిస్ట్ అరెస్ట్ ను నిరసిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేరళలో అతిపెద్ద జర్నలిస్ట్ యూనియన్) సుప్రీంను ఆశ్రయించింది. అయితే కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేయూడబ్ల్యూజే) వేసిన హెబస్ కార్పస్ విచారణను నాలుగు వారాల తర్వాత వింటామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు తమకు సమయం లేనందున 28 రోజులకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని కేయూడబ్ల్యూజేకు సూచించింది.

హథ్రస్‌లో ఒక దళిత యువతీ మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతంపై రిపోర్టు చేసేందుకు అక్టోబర్ 6న హథ్రస్‌కు వెళ్తున్న సిద్ధిఖీ సహా ఆతిఖ్ రెహ్మాన్, మసూద్ అహ్మద్, ఆలం అనే మరో ముగ్గురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేస్తున్నారనే అనుమానంతో అరెస్ట్ చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news