భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పిఎఫ్ఐ కుట్ర చేస్తుంది – బండి సంజయ్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ నాగోల్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందన్నారు. ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ పనిచేస్తుందన్నారు. జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్ఐ విస్తరిస్తుందన్నారు. పీఎఫ్ఐను టిఆర్ఎస్ పెంచి పోషిస్తుందని ఆరోపించారు.

హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ కు సిగ్గు లేదా? అంటూ మండిపడ్డారు. ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్ కు సోయి ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమేనన్నారు. హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యం అన్నారు బండి సంజయ్. కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా కేసీఆర్ లెక్క చెప్పడం లేదన్నారు. భూములున్నా పట్టాలివ్వని దుర్మార్గుడు కెసిఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబానికి లంచాలిస్తే తప్ప పనులు కాని దుస్థితి నెలకొందన్నారు. ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లను అరెస్ట్ చేసి జైళ్లో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర ఉందన్నారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్…. లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపవు? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి కేసీఆర్ కుటుంబం క్వారంటైన్ లోకి పోతోందని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news