వారణాసిలో మోదీ హ్యాట్రిక్ విన్.. 1.52 లక్షల ఓట్ల మెజార్టీ

-

లోక్​సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో మూడోసారి విజయ ఢంకా మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్​ రాయ్​పై 1,52,513 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, మోదీపై అజయ్​ రాయ్ పోటీ చేయడం వరుసగా మూడోసారి. 2014లో ప్రధాని తొలిసారి ఇక్కడ పోటీ చేయగా, 56 శాతం ఓట్లతో విజయం సాధించారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అజయ్‌ రాయ్‌కు కేవలం 75వేల ఓట్లు దక్కాయి. ఆమ్‌ ఆద్మీ తరఫున అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక, 2019 ఎన్నికల్లో ప్రధానికి 63 శాతం ఓట్లు రాగా, అజయ్‌ రాయ్‌కి 14శాతం ఓట్లు దక్కాయి. మోదీ విజయంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. మోదీకి పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news