కెసిఆర్ ని ఎదుర్కొనే దమ్ము కొత్త బిచ్చగాళ్లకు లేదు – స్పీకర్ పోచారం

-

బిజెపి నాయకుల పై తీవ్ర విమర్శలు చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ రాయపూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..కొత్త బిచ్చగాళ్లకు కేసిఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేదంటూ ధ్వజమెత్తారు. నడిచే వాళ్ల కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కొందరు కుట్ర చేస్తున్నారని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందని, దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని సవాల్ విసిరారు. పేపర్ లీకేజీ దుర్మార్గమైన చర్య అని, దొంగే దొంగ దొంగ అంటున్నారని, వారికి ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలే ఎన్నికలలో బొంద పెడతారని హెచ్చరించారు. ఎవరికి భయపడేది లేదని, బిజెపికి పదిమంది ఉంటే మాకు 90 మంది ఉన్నారని అన్నారు. దమ్ముంటే గ్రామాల అభివృద్ధికి నిధులు తేవడంలో పోటీ పడాలన్నారు పోచారం. కోట్లాదిమంది ఆత్మీయుల ఆశీర్వాదం, అండ మాకు ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news