BREAKING : జేపీ నడ్డా ర్యాలీకి పోలీసుల అనుమతి

-

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీకి తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారు. పరిమిత సంఖ్యలో బిజెపి నాయకులు నడ్డా ర్యాలీలో పాల్గొనాలని షరతులు పెడుతూ ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చారు తెలంగాణ పోలీసులు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కాసేపటి క్రితమే చేరుకున్న జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చిన పోలీసులు… ర్యాలీకి కూడా అనుమతి ఇచ్చారు.

దీంతో బిజెపి నాయకుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్ వెళ్లనున్నారు జేపీ నడ్డా. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా… తెలంగాణ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరగనుంది. సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం నుంచి పేరడైజ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ ర్యాలీ కొనసాగనుంది. ఇక ఈ ర్యాలీలో జెపి నడ్డా తో సహా… డీకే అరుణ, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news