బ్రేకింగ్: మహిళా ఎంపీని కొట్టిన పోలీసు

-

హత్రాస్ వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన 19 ఏళ్ల యువతీ కుటుంబాన్ని పరామర్శించాలని భావించిన తృణముల్ కాంగ్రెస్ నేతలను కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన స్థానికంగా దుమారం రేపింది. ఈ ఘర్షణలో ఒక పోలీసు అధికారి ఎంపీపై చేయి చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తృణమూల్ ఎంపి ప్రతిమా మండల్ మాట్లాడుతూ…

“మమతా బెనర్జీ అమ్మాయి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేయడానికి మమ్మల్ని ఇక్కడికి పంపారు. నేను దళిత మహిళను. ఈ దేశంలో దళితులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో నాకు అర్ధమైంది. ఒక అమ్మాయి మృతదేహం ఎలా కాలిపోయిందో మనం చూసాం. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి. జెఎం ప్రేమ్ కుమార్ మీనా నాతో తప్పుగా ప్రవర్తించింది. నా మీద చేయి చేసుకుంది… అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news