నూతన్ నాయుడు భార్యను వెంటాడుతున్న పోలీసులు…!

-

నూతన్ నాయుడు భార్య మధు ప్రియ మళ్ళీ అరెస్ట్ అయ్యారు. బెయిల్ పై విడుదల అయిన కొద్ది గంటల్లో నే మళ్ళీ అరెస్ట్ చేసారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులో ఈ నెల 20 వరకు మధుప్రియకు రిమాండ్ విధించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ వ్యక్తి కి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసారు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ.

ఉద్యోగాల పేరుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసారు. ఇటీవల నూతన్ నాయుడు బాగోతం వెలుగు చూడటంతో పోలీసులు ను ఆశ్రయించాడు బాధితుడు. మధుప్రియ బ్యాంక్ అకౌంట్ కు రూ. 25 లక్షలకు సంబంధించి రెండు సార్లు లావాదేవీలు జరిపినట్లు పోలీసుల దర్యాప్తు లో వెల్లడి అయింది. దీంతో మధుప్రియను మరోసారి అరెస్ట్ చేసారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news