బిగ్ బ్రేకింగ్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్..

-

శంషాబాద్ పరిసరాల్లో దారుణ హత్యాచారానికి గురైన దిశ కేసులో ఒక్కో నిజం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న విష‌యం తెలిసిందే. మనిషి రూపంలో ఉన్న నలుగురు రాక్షసులు దిశపై ముందు అత్యాచారం చేసి ఆ తరువాత చంపేసి దిశకు నిప్పంటించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. దిశ బతికుండగానే ఆమెకు నిప్పంటించారని తెలుస్తోంది. దిశను సజీవ దహనం చేసినట్లు తాజాగా వెల్లడైంది. చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకడైన ఆరీఫ్ ఈ మేరకు పోలీసు అధికారులకు చెప్పాడు.

అయితే తాజాగా దిశ హత్య కేసు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. పారిపోతున్న నలుగురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, దిశ హత్య కేసు నిందితులను బుధవారం పోలీస్ కస్టడీకి షాద్ నగర్ కోర్టు అనుమతిచ్చింది. అనంతరం చర్లపల్లి జైలు నుంచి నిందితులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. గురువారం విచారణ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news