నేడే..తెలంగాణకు రాహుల్‌ రాక.. సభకు భారీ బందోబస్తు..

-

ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే నేడు వరంగల్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొ్ంటారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో భారీ బందోబస్తును పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ వెంట కేంద్ర రక్షణ దళం NSG కమాండ్‌తో పాటు వ్యక్తిగత జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్పైడర్ తో నిరంతర పర్యవేక్షణ.. NSG కమాండోలు వేదికకు వెనుక ముందు చుట్టుపక్కల రక్షణ వలయంల ఉంటారు.

వరంగల్‌కు సుమారు 50 మంది కమాండోలు వచ్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. వరంగల్ పోలీస్‌ కమిషనర్‌ నుండి హోంగార్డు వరకు సుమారు 1,060 మంది పోలీసులు వీధుల్లో ఉండనున్నారు. ఒక డీసీపీ, ఏడుగురు ఏసీపీలు, 29 మంది ఇన్స్పెక్టర్లు, 60 మంది ఎస్ఐలు, 132 మంది హెడ్ కానిస్టేబుల్, 836 మంది వివిధ విభాగాల పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news