కోడి పందాల డెన్‌లపై పోలీసుల ఆకస్మిక దాడులు.. 15 మంది అరెస్టు!

-

కొమురం భీమ్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటన జిల్లాలోని బెజ్జూర్ మండల పరిధిలో గల మొగవెళ్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కోడి పందాల నిర్వహిస్తున్నారని ముందస్తుగా సమాచారం అందడంతో ఆ స్థాపరాలపై కౌటాల సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో చింతల‌మానేపల్లి ఎస్సై నరేష్, బెజ్జూర్ ఎస్సై విక్రం గురువారం రాత్రి మెరుపు దాడులు జరిపారు.

ఆ సమయంలో పందాలు వేస్తున్న వారిపై పట్టుకోవడానికి ప్రయత్నించారు. మొత్తం 30 మంది వరకు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. పలు బైక్‌లు, నాలుగు కోళ్లు, రూ.3,289 నగదును స్వాధీనం చేసుకున్నట్లు బెజ్జూర్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఈ దాడుల్లో కోళ్ల పందాలు ఆడుతోన్న 15 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నామని తెలిపారు.ఇక మీదట ఇటువంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version