అగ్ర నేతలకు గురి పెట్టిన పోలీసులు…!

-

తెలంగాణాలో ఒక పక్క కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నా సరే, మావోయిస్ట్ ల అడుగులు మాత్రం వేగంగా పడుతున్నాయి. తమకు పట్టున్న ఉత్తర తెలంగాణా జిల్లాల్లో మావోయిస్ట్ లు ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కఠినం గా ఉండి, దాడులు చేస్తున్నా సరే, మావోయిస్ట్ లు మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. దీనితో నాలుగు జిల్లాల్లో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

వరంగల్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ లో మావోల అలజడి మొదలయింది. దీనితో ఇప్పుడు కీలక నేతలను పోలీసులు టార్గెట్ చేసారు. అమరవీరుల వారోత్సవాలు ఉన్న నేపధ్యంలో, మావోయిస్ట్ అగ్ర నేతలు ఇప్పుడు గ్రామాల్లో పాగా వేస్తున్నారు. దీనితో అగ్ర నేతలను టార్గెట్ గా చేసుకుని పావులు కదుపుతున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే, ఏ చర్యకు అయినా సరే పోలీసులు సిద్దమవుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version