పుట్ట మధు విషయంలో బ్యాంకుల వెంట పడుతున్న పోలీసులు

-

న్యాయవాద దంపతులు వామన రావు హత్యకు సంబంధించి పోలీసులు సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. పుట్ట మధుని అదుపులోకి తీసుకున్న పోలీసులు 12 బ్యాంక్ లకు లేఖలు రాసారు. పుట్టా మధు, పుట్ట శైలజ , పుట్టా మధు కొడుకు, కోడలు, కూతురు అకౌంట్స్ వివరాలు ఇవ్వాలని లేఖ రాసారు. పుట్ట సతీష్ , రాయచూర్ శ్రీనివాస్, కుంట శ్రీను, బిట్టు శ్రీనివాస్ , పూదరి సత్యనారాయణ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ లకు పోలీసుల నోటీసులు ఇచ్చారు.

వామన్ రావ్ హత్యకు రెండు నెలల ముందు, రెండు నెలల ట్రాన్సాక్షన్స్ వివరాలు కోరుతూ పోలీసుల లేఖ రాసారు. 5 లక్షలకు మించి లావాదేవీల వివరాలు ఇవ్వాలని పోలీసుల లేఖలో పేర్కొన్నారు. రెండు కోట్ల వ్యహారం తేల్చేవరకు కొనసాగనున్న విచారణలో మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news