జేసీ బ్రదర్ పై మరో కేసు, పాపమే నిజంగా…!

-

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరో కేసు నమోదు చేసారు అనంతపురం జిల్లా పోలీసులు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేసారు తాడిపత్రి పట్టణ పోలీసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి తో పాటు మరో 32 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేసారు. కరోనా పాజిటివ్ బారినపడి హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు ఆయన.

హోం క్వారంటైన్ పూర్తి చేసుకుని నిన్న తాడిపత్రి కి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి భారీగా స్వాగతం పలికారు. తాడిపత్రి కి వస్తున్న సందర్భంగా భారీగా తరలివచ్చి స్వాగతం పలకడంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారు అని కేసు నమోదు అయింది. ఇటీవల ఆయన వాహనాల విషయంలో జైలుకి కూడా వెళ్లి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news