దేవినేని ఉమ “ఆడో-మగో” టెస్ట్ చేయించుకుంటే మంచిది: మంత్రి అనీల్

-

అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, అర్ధం లేని ఆరోపణలు చేసే టీడీపీ నాయకులపై నిప్పులు చెరగడంలో ఏమాత్రం వెనకా ముందు ఆలోచించని వైకాపా నెతల్లో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఒకరు! అది అసెంబ్లీ లో అయినా, బయట పత్రికా సమావేశంలో అయినా, పబ్లిక్ మీటింగ్ లో అయినా… ఒకసారి మైకందుకుంటే ప్రత్యర్ధికి దబిడి దిబిడే అంటుంటారు ఆయన మాటలకు అభిమానులు. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా దేవినేని ఉమపై ఫైరయ్యారు అనీల్ కుమార్!

ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న టీడీపీ నేత దేవినేని ఉమ గురించి మైకందుకున్న అనీల్… కరోనా టెస్టుల గురించి మాట్లాడే కంటే ముందు తను ఆడో-మగో టెస్ట్ చేయించుకుంటే మంచిదంటూ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ గారు చెప్పినట్టు అసలు ఉమ ఏదో ఆయన తెలుసుకోవాలి ఫస్ట్.. ముందు ఆ టెస్ట్ చేయించుకోవాలి.. ఆ ఉమాకు ఏం తెలుసో తెలియదో భగవంతుడికే తెలియాలి.. ఈ టీడీపీ నేతలంతా ఇళ్లల్లో కూర్చొని ఏడుస్తున్నారు.. పేదలకు ఎలాంటి సాయం అందించకుండా ఇళ్లల్లో దాక్కుంటున్నారు.. ఇక ఈ ఉమకు తెలిసింది ఒకటే.. గొంతేసుకొని వాగేయడం, ఇంటికి పోయి పడుకోవడం.. అంటూ నిప్పులు చెరిగారు మంత్రి అనీల్!

అనంతరం టాపిక్ చంద్రబాబువైపు మళ్లించిన అనీల్… అసలు ఉమానే కాదు, ఇలాంటి నాయకుల్ని పెంచి పోషిస్తున్న చంద్రబాబుదే తప్పని విమర్శించారు. కరోనా వస్తుందని తెలిసిన వెంటనే పొరుగు రాష్ట్రానికి పోయి దాక్కున్న, ఇలాంటి నేత ఏపీకి ప్రతిపక్ష నేతగా ఉండడం సిగ్గుచేటని అభిప్రాయపడిన అనీల్… హైదరాబాద్ లో దాక్కున్న చంద్రబాబు.. ఓవైపు ప్రభుత్వంపై చవకబారు విమర్శలు చేస్తూనే, మరోవైపు కొడుకు లోకేష్ కు సైకిల్ తొక్కడం నేర్పిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్ ఉంటే, కరోనా వచ్చిన తర్వాత 9 ల్యాబ్స్ పెట్టామని, అందులో దాదాపు 1200 వైద్యుల్ని నియమించామని చెప్పిన అనీల్… ఇలా అన్ని చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబుకు మాత్రం ఏమీ కనిపించవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ సర్కారు ఇన్ని చర్యలు తీసుకుంటుంటే.. పోయి పక్క రాష్ట్రంలో నక్కి కూర్చొని.. మినిమం కామన్ సెన్స్ లేని మనుషులతో ఇక్కడ మాట్లాడిస్తున్నాడు అంటూ బాబుపై ఫైరయ్యారు మంత్రి అనీల్!

Read more RELATED
Recommended to you

Latest news