టీడీపీ మంత్రి దేవినేని ఉమా నీచ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి..!

-

కృష్ణా జిల్లా మైలవరంలో జగన్ తన ప్రచార సభను ముగించుకున్న తర్వాత ఘర్షణ చోటు చేసుకున్నది. సీఐఎస్ఎఫ్ జవాన్లు జగన్ సభకు వచ్చిన జనాలను తీవ్రంగా కొట్టారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో టీడీపీ క్షుద్ర రాజకీయాలకు తెర తీసింది.. అనే విషయం ఇప్పటికే పలుమార్లు స్పష్టమైంది. ఏపీలో వార్ వన్ సైడ్ అవ్వడం.. వైఎస్ జగన్ వైపే ఏపీ ప్రజలు ఉండటంతో ఎలాగైనా జగన్ పై బురద జల్లి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

AP minister devineni Uma Mischievous politics in mailavaram

దానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. కృష్ణా జిల్లా మైలవరంలో జగన్ తన ప్రచార సభను ముగించుకున్న తర్వాత ఘర్షణ చోటు చేసుకున్నది. సీఐఎస్ఎఫ్ జవాన్లు జగన్ సభకు వచ్చిన జనాలను తీవ్రంగా కొట్టారు. జగన్ ఎన్నికల ప్రచార సభకు లక్షలాదిగా తరలి వస్తున్న జనాలను చూసి ఓర్వలేక ఏపీ మంత్రి దేవినేని ఉమా చేసిన నీచ రాజకీయాలు ఇవి. పోలీసులపైకి చెప్పులు విసిరేయించింది… రాళ్లు వేయించడానికి కారణమైంది కూడా దేవినేని ఉమాయే. మైలవరం ప్రజలకు దేవినేని ఉమ కుట్ర, కుతంత్రాలు అర్థమయ్యాయని మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

AP minister devineni Uma Mischievous politics in mailavaram

సీఐఎస్ఎఫ్ జవాన్లు జనాలపై విరుచుకుపడిన వీడియోను వైఎస్సార్సీపీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news