అదృష్ట‌మంటే స‌త్తిబాబుదే… ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవ‌మ‌వుతున్నారు…!

-

వైసీపీ సీనియ‌ర్ నేత, మాజీమంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎమ్మెల్సీ అవుతున్నారు. అవును ఆయ‌న మ‌ళ్ళీ చ‌ట్ట‌స‌భ‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన బొత్సా ఓట‌మి పాల‌య్యారు. కానీ రెండు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే మ‌ళ్ళీ అయ‌న చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగుపెట్టేస్తున్నారు. విశాక స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల బ‌రిలో కూట‌మి అభ్య‌ర్ధిని ఇంకా డిసైడ్ చేయ‌లేదు. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు మ‌రికొన్ని గంట‌లే మిగిలి ఉన్నాయి. అభ్య‌ర్ధి ప్ర‌క‌ట‌న‌పై చంద్ర‌బాబు సైలెంట్‌గా ఉండ‌టంతో పోటీ నుంచి ఆ పార్టీ త‌ప్పుకున్న‌ట్లే అని చ‌ర్చించుకుంటున్నారు. ఇప్ప‌టికే నామినేష‌న్ దాఖ‌లు చేసిన వైసీపీ అభ్య‌ర్ధి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏక్ర‌గీవంగా ఎన్నిక‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో వైసీపీ నేత‌లు ఉత్త‌రాంధ్ర వేదిక‌గా సంబ‌రాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో టిడిపి అభ్యర్థి రంగంలో ఉంటారా? ఉండరా? అనే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. టిడిపి అనుకూల మీడియాలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికకు ఆ పార్టీ దూరం అని ప్రత్యేక కథనం వచ్చేసింది. స్థానిక సంస్థల్లో 60 శాతానికి పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండడంతో… ఓడిపోయే చో్ట ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్ అని టిడిపి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు స‌మాచారం.రెండు నెల‌ల కింద‌టే ఏపీలో కూట‌మి పార్టీలు భారీ మెజారిటీతో గెలిచాయి.

శాస‌న‌స‌భ‌లో ఆ పార్టీదే పూర్తి ఆధిప‌త్యం. ఇప్పుడు ఎమ్మెల్సీ ని తప్పనిసరిగా గెలవాలన్న అవ‌స‌రం ఏమీ లేదు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే అవమాన‌క‌రంగా ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే అభ్య‌ర్ధిని పోటీ పెట్టడానికి ముందుకు రానట్లు తెలుస్తోంది. ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది.అటు చాలా మంది టిడిపి నేతలు పోటీ పెట్టకపోవడమే బెటర్ అని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తాము గెలిపించుకుంటామని ముందుకు వచ్చినట్లు సమాచారం.ఇప్పుడు అంత రిస్క్ తీసుకుని పోటీ చేయాల్సిన అవ‌స‌రం ఎందుకులే అని చంద్ర‌బాబు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది.

విశాఖ ఎమ్మెల్సీ బ‌రిలో వైసీపీ త‌ర‌పున అభ్య‌ర్ధిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇప్ప‌టికే నామినేష‌న్ దాఖ‌లు చేశారు. మొత్తం 860 ఓట్లకు గాను.. వైసీపీకి 600 ఓట్ల‌ వరకు బలం ఉంది.అయితే ఇటీవ‌ల కొంద‌రు కూట‌మి పార్టీల్లో చేర‌డంతో టిడిపి కూటమికి 300 వరకు బలం చేకూరిన‌ట్లు స‌మాచారం. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లకు సైతం ఓట్లు ఉన్నాయి. ఉమ్మడి విశాఖలో రెండు నియోజకవర్గాలు తప్పించి.. అన్నిచోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. దాదాపు 200 ఓట్లు కూట‌మి వైపు తిప్పుకుంటేనే ఈ ఎన్నిక‌లో విజ‌యం వ‌రిస్తుంది.

ఇప్పటికే వైసీపీ బెంగళూరు శిబిరానికి తమ ఓటర్లను తరలించింది. వారితో క‌నీసం ఫోన్‌లో కాంటాక్ట్ అయ్యే ప‌రిస్థితి కూడా లేదు. అందుకే పోటీ చేయకపోవడమే ఉత్తమమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైసిపి స్థానిక సంస్థలను చాలావ‌ర‌కు ఏకగ్రీవం చేసుకుంది.దీంతో వైసీపీకి ఎక్కువ మంది ఓట‌ర్లు ఉన్నారు. అందుకే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు సమాచారం. ఈరోజు చివరి రోజు కావడంతో కూటమి తరుపున నామినేషన్ పడకపోతే.. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అవుతారు.మొత్తానికి రెండు నెల‌లు గ‌డ‌వ‌క‌ముందే బొత్స‌కు అదృష్టం వ‌రిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news