బ్రేకింగ్; జనసేన-బిజెపి లాంగ్ మార్చ్ వాయిదా…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ జనసేన- బిజెపి పార్టీలు తలపెట్టిన లాంగ్ మార్చ్ ని వాయిదా వేసారు. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం వచ్చే నెల 2 న ఈ మార్చ్ చెయ్యాల్సి ఉంది. ఎందుకు వాయిదా వేస్తున్నారు అనేది స్పష్టత లేకపోయినా అనూహ్యంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నాయి రెండు పార్టీలు.

ఇక ఇదిలా ఉంటే జనసేన బిజెపి రాజధాని అమరావతి విషయంలో ఏ వైఖరి అవలంభిస్తాయి అనేది స్పష్టత రావడం లేదు. రాజకీయంగా రెండు పార్టీలు కలిసి ముందుకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నా సరే అమరావతి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదని తెలుస్తుంది. అటు కేంద్రం కూడా పవన్ కి ఈ విషయంలో ఏ స్పష్టత ఇవ్వడం లేదని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఢిల్లీ పర్యటనకు వెళ్లి బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ సమావేశం కూడా అయ్యారు. ఆ తర్వాత తాడేపల్లి నుంచి విజయవాడ వరకు యాత్ర చేస్తామని ప్రకటించారు. దీనికి బిజెపి కూడా మద్దతు ఇచ్చింది. అయితే రాజధాని విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై ఒక్కసారి సర్వే చేసి ఆ తర్వాత ముందుకి వెళ్ళాలి అని భావించే దీనిని వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news