పెరుగుతున్న చంద్రబాబు బాధితులు

-

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు బాధితుల సంఖ్య పెరుగుతుంది.. నమ్మి పార్టీలో చేరితే నట్టేట ముంచేసారనే ప్రచారం జరుగుతుంది.. సీటు కోసం చంద్రబాబు దగ్గరికి వెళితే.. నెత్తిన శఠ గోపమ్మ పెడుతున్నారని కొందరు నేతలు మదన పడిపోతున్నారు. ఇంతకీ ఉమ్మడి కర్నూలు జిల్లా టిడిపిలో ఏం జరుగుతుంది..

కర్నూలు జిల్లా రాజకీయాలను దశాబ్ద కాలం పాటు శాసించిన కోట్ల కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం జోరుగా వినిపిస్తోంది.. కోట్ల సుజాతమ్మ 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆలూరు టికెట్ తీసుకున్న ఆమె వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం చేతిలో ఓటమిపాలయ్యారు.. తనను కాదని చివరి నిమిషంలో సుజాతమ్మకు టికెట్ ఇవ్వడం పై.. వీరభద్ర గౌడ్ చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట.. చంద్రబాబు మోసం చేయడంలో దిట్టని వీరభద్ర గౌడ్ అనుచరులు ఇప్పటికీ కూడా చెబుతూనే ఉన్నారు..

మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఆలూరు టికెట్ పై టిడిపి నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.. మరోసారి కోట్ల సుజాతమ్మకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. లేక మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వీరభద్ర గౌడ్, వైకుంఠం వంటి నేతలకు ప్రాధాన్యత ఇస్తారా అనే చర్చ క్యాడర్లో మొదలైంది.. చంద్రబాబు నాయుడు నైజం తెలిసిన టిడిపి నేతలు మాత్రం కోట్ల కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు.. అందులో భాగంగానే కోట్ల కుటుంబానికి ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు పంపారట.. తనకు గాని ఆలూరు టికెట్ ఇవ్వకపోతే టిడిపి అభ్యర్థిని ఓడిస్తానని కోట్ల సుజాతమ్మ తన అనుచరుల వద్ద చెబుతున్నారట.. మొత్తంగా ఆలూరు టికెట్ ఎవరిని వరించబోతుందో భవిష్యత్తే నిర్ణయించాలీ..

Read more RELATED
Recommended to you

Latest news