కరీంనగర్ లో 13 ఏళ్ల బాలిక మిస్సింగ్.. 5 బృందాలతో గాలింపు

-

కరీంనగర్ జిల్లాలో ఓ బాలిక తప్పిపోయిన సంఘటన కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం 13 ఏళ్ల వశిష్ట క్రిష్ణ  ను తన తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించాడు. ఆ బస్సు నంబర్ ఆమె తండ్రికి పంపించాడు. అయితే కరీంనగర్ బస్టాండ్ లో ఎదురుచూస్తున్న తండ్రికి ఆమె బస్సులో కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె కుంటుంబ సభ్యులు కరీంనగర్ లోని రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైట్ ఇచ్చారు. వెంటనే ఐదు బృందాలతో గాలింపు చర్యలు మొదలుపెట్టిన పోలీసులు.. ఆమె కరీంనగర్ లోని మంచిర్యాల్ చౌరస్తాలో దిగాల్సివుండగా బైపాస్ ఫ్లై ఓవర్ వద్ద దిగినట్లు సీసీపుటేజీ ఆధారంగా గుర్తించారు.

తమ కూతురు ఎక్కడికి వెళ్లిందో, ఏమైపోయిందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకీ కోసం కన్నీరుమున్నీరవుతున్నారు. అచూకీ తెలిసిన వారు – 99126679579 నెంబరుకు ఫోన్ చేయాలని వేడుకుంటున్నారు. ఇక ఆ అమ్మాయికోసం కరీంనగర్ పట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో పోలీసులు వెతుకుతున్నారు. ఆ బాలిక కావాలనే బస్సు దిగిందా? లేక ఎవరైనా కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారా? కిడ్నాప్ చేశారా? అనే కోణాల్లో పోలసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news