డ్రైవర్ మనువరాలితో అక్షరాభ్యాసం చేయించిన సీఎం…!

-

విజయదశమి రోజున మన దేశంలో ఎన్నో పవిత్ర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటారు. ఆ రోజున ఏదైనా కార్యక్రమం చేపడితే మంచి జరుగుతుంది అనే భావన చాలా మందిలో ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఆ రోజున చాలా కార్యక్రమాలు పెట్టుకుంటారు. తాజాగా కేరళలో సిఎం పినరాయి విజయన్ ఒక మంచి అడుగు వేసారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలో తన డ్రైవర్ మనవరాలు దేవానాతో కలిసి ‘విద్యారంభం’ వేడుకను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆ బాలికతో అక్షరాభ్యాసం చేయించారు సిఎం. కాగా ‘విద్యారంభం’ అనేది పిల్లలను స్కూల్ లో చేర్పించడానికి, వారికి చదువు నేర్పించడానికి మొదలుపెట్టే ఒక కార్యక్రమం. ఇది విజయ దశమి రోజున అక్కడ లాంచనంగా ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news