కేసీఆర్ ఇంకో నాలుగేళ్లే ఆ తర్వాత కష్టం: కాంగ్రెస్ నేత జోస్యం

-

కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఠాకుర్ గారు మనకు దిశా నిర్ధేశం చేశారని అన్నారు. 2023లో 79 సీట్లు తెలంగాణలో గెలవాలని టార్గెట్ పెట్టారు. కాంట్రాక్టులు, కమీషన్లు, కుట్రలు తెలంగాణలో జరుగుతున్నది అంటూ ఆయన ఆరోపించారు. రైతు , యువత , మహిళలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తెలంగాణ అని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఇన్ని అబద్ధాల సీఎంను ఎక్కడా దేశంలో చూడలేదని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ కుటంబం నుంచి తెలంగాణను కాపాడుకునే బాధ్యత ప్రజల పై ఉందని, మోదీ హయాంలో అంబానీ , అదానీలదే హవా అని ఆయన ఆరోపించారు. మోదీ , కేసీఆర్ లకు గుణపాఠం చెప్పాలని కోరారు. 2023 కాదు 2022లోనే ఎన్నికలు వస్తాయన్న ఆయన… కేసీఆర్ నాలుగేళ్ల కన్నా ఎక్కవ కాలం పాలించరని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news