రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని ఆమరణ దీక్ష

-

తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి ఉత్తమ కుమార్ రెడ్డి తప్పుకున్నారు. ఇప్పుడు ఎవరిని నియమిస్తారు ఏంటీ అనే దానిపై స్పష్టత లేదు. అయితే రేవంత్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వాలి అంటూ ఒక నేత ఆమరణ దీక్షకు దిగడం గమనార్హం. రేవంత్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైదరాబాద్ పాతబస్తి చాంద్రాయణగుట్ట లో కాంగ్రెస్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాల రాజేందర్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీలో ధీటైన నాయకుడు మరియు ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు అయిన రేవంత్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాసినట్టు వెల్లడించారు. 2023లో జరిగే ఎన్నికలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news