విజయవాడ : దాడి జరిగిన 23 రోజుల తర్వాత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో మంత్రి ఉమ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. తనపై కుట్ర పన్నారంటూ ముఖ్యమంత్రిని, డీజీపీని జగన్ ముద్దాయిలుగా పేర్కొనడం సరికాదన్నారు. జగన్ కేసు విషయంలో పోలీసు విచారణ సక్రమంగానే జరుగుతోందన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్ పోలీసులకు సహకరించలేదని..ఇప్పుడు 23 రోజుల తర్వాత థర్డ్ పార్టీ విచారణ జరపాలనడం దారుణమని మండిపడ్డారు. జగన్ నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు పలు సార్లు ప్రయత్నించినా ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రక్తపు మరకలు పడిన చొక్కాను పోలీసులకిచ్చి సహకరించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం జగన్ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రా పోలీసులపై జగన్కు నమ్మకం లేదని.. బాధ్యతలను విస్మరించి ఆయన మాట్లాడటం మంచిపద్ధతి కాదని విమర్శించారు.
జగన్కు మతి భ్రమించింది: దేవినేని ఉమ
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదు.. అన్యాయం జరిగినప్పుడు తిరబడాలి : పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర...
Ganesh -
భువనగిరి లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుంది.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..!
చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం...
మళ్ళీ జగనే సీఎం – KTR
ఈసారి ఎన్నికల్లో హీట్ మొదలైంది. అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని మొదలుపెట్టేసాయి...