ఫస్ట్ టైమ్ కోర్టు లో గెలవాల్సిన టైమ్ వచ్చింది జగన్ ..!

-

అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు ముందుగా హైలెట్ అయినాగానీ అమలులోకి వచ్చే సరికి అట్టర్ ఫ్లాప్ అయ్యేవి. ఎక్కువగా న్యాయస్థానం ముందు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అంటూ గతంలో అనేక తీర్పులు రావడం జరిగాయి. ఇంగ్లీష్ మీడియం, రాజధాని అమరావతి, వైస్సార్సీపీ పార్టీ రంగుల విషయం ఇలా అనేక విషయాలలో కోర్టు చేత అక్షింతలు వేయించుకుంది. దాదాపు పది నెలల పరిపాలన కాలంలో ఏ ఒక్క అంశంలో కూడా జగన్ సర్కార్ కు న్యాయస్థానంలో ఊరట లభించలేదు. ఇటువంటి నేపథ్యంలో ఫస్ట్ టైం కోర్టులో గెలవాల్సిన టైం జగన్ కి వచ్చింది.జగన్‌కు కొత్త పరీక్ష... ఆ ఇద్దరిలో ...రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీ పదవి నుంచి తొలగించడానికి జగన్ సర్కార్ కొత్త ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఐదు సంవత్సరాల పదవీ కాలం మూడు సంవత్సరాలకు కుదించడంతో ఆటోమేటిక్ గా నిమ్మగడ్డ పదవి నుండి దిగి పోవాల్సి వచ్చింది. దీంతో తన పదవి నుండి రాజకీయ కక్షతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందని నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే టైములో ప్రతిపక్షాలు కూడా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో  వ్యతిరేకించాయి.

కరోనా వైరస్ అనే మహమ్మారి తో ప్రజలు పోరాడుతున్న టైములో రాజకీయాలు చేయటం ఈ టైంలో అవసరమా అని చాలామంది జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లడంతో.. సోమవారం కోర్టు ముందుకు రాబోతున్న ఈ విషయంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరోపక్క కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చిన దానిపై గవర్నర్ సంతకం పెట్టడం తో న్యాయస్థానం జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

అదే టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కులం పై పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువస్తే… నిమ్మగడ్డకు న్యాయస్థానం అండగా ఉండే అవకాశం కూడా ఉందని మరొక వాదన వినబడుతోంది. మరి ఇటువంటి టైం లో అధికారంలో ఉన్న జగన్ ఈ విషయంలో జగన్ విసురుతున్న గవర్నర్ బాణం ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఈ విషయంలో ఓడిపోతే మాత్రం జగన్ నిర్ణయాలకు ప్రభుత్వ వర్గాలలో విలువ ఉండదని చాలామంది అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news