బ్రేకింగ్: ఏపీలో బీరు సీసాలపై దేవుళ్ళ బొమ్మలు

-

ఆంధ్రప్రదేశ్ లో ఒకపక్క హిందు దేవాలయాలపై దాడుల విషయంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నా సరే కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బీరు సీసాలపై రాముడి బొమ్మలు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి మీడియాకు వివరించారు. బీరు సీసాలపై హిందూ దేవుళ్ల బొమ్మలా? అని ఆయన ప్రశ్నించారు.

ఇతర మతాలకు సంబంధించిన ఇలా చేయగలరా? అని ఆయన నిలదీశారు. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లో వీటిని తక్షణం నిషేధించాలి అని డిమాండ్ చేసారు. కంపెనీలపై చర్యలు తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news