ఆ అభ్య‌ర్థి ఫిక్స్ అయ్యాడా.. కేసీఆర్ మ‌దిలో ఏముంది?

-

హుజూరాబాద్ రాజ‌కీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మ‌రాయి. ఇంకా నోటిఫికేష‌న్ రాకున్నా.. అప్పుడే ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారం హోరెత్తిస్తున్నాయి. మ‌రీముఖ్యంగా కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే అన్ని ఊర్ల‌ను చుట్టేస్తూ అక్క‌డే మ‌కాం వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని ర‌కాలుగా అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నారు.

అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేయ‌డానికి ఎంతోమంది పోటీ ప‌డుతున్నారు. కాగా ఈట‌ల రాజేంద‌ర్ లాంటి నాయ‌కుడిని ఢీ కొట్టాలంటే బ‌ల‌మైన అభ్య‌ర్థి కావాల‌ని కేసీఆర్ ప‌లు స‌ర్వేలు కూడా చేయిస్తున్నారు.

కాగా ఇందులో ఇప్ప‌టికే ప‌లువురిపై అభిప్రాయం తీసుకున్న కేసీఆర్ ఓ అభ్య‌ర్థిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెడుతున్నారు. ఆయ‌నే వేముల‌వాడ టెంపుల్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మ‌న్‌గా చేస్తున్న ముద్ద‌సాని పురుషోత్తం రెడ్డిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు స‌మ‌చారం. ఆయ‌న ఇది వ‌ర‌కు న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌కు క‌లెక్ట‌ర్‌గా చేశారు. క‌మ‌లాపూర్ నుంచి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వ‌హించిన దామోద‌ర్‌రెడ్డి అన్న‌నే ఈ పురుషోత్తం రెడ్డి. మ‌రి ఈ సింప‌తీ క‌లిసొస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news