ఇప్పటి వరకూ దేశంలో ఏ సీఎం చేయని పని చేసిన జగన్..!

-

దేశంలో ఎన్నో ఆర్థిక నేరాలు జరుగుతుంటాయి. జనం బలహీనతలు సొమ్ము చేసుకునేందుకు అనేక మంది ఆశ చూపి కోట్లు పోగేసుకుని బోర్డు తిప్పేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో బాధితులకు నూటికి 90 శాతం న్యాయం జరగదు. కానీ దేశంలోనే తొలిసారిగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆర్థికంగామోసపోయిన వారికి ప్రభుత్వం తరపున పరిహారం అందించారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్‌ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నించారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడులే.. అంటూ చంద్రబాబు రూ. 65 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, వేల కోట్ల అప్పులతో ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఇచ్చిన మాట కోసం మొదటగా రూ. 10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి ప్రభుత్వమే నేరుగా చెల్లించబోతోందని కన్నబాబు తెలిపారు.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కూడా ఇదే విషయం చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్న తాము ఆనందం వ్యక్తం చేసే రోజు ఇది అని హర్షం వెలిబుచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితుల తరపున పోరాటం చేసిన తర్వాత తమ కార్యాలయంలోనే దాదాపు 80 శాతం మంది బాధితులు తమపేర్లు ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news