కవిత ఎంపీగా ఓడిపోలేదు, ఆమెకు కేబినేట్ పదవి ఇవ్వాలి: ఎమ్మెల్యే

-

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. ఆమె విజయం సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆమెకు అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజీయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కవితకు క్యాబినెట్ స్థాయి పదవి ఇవ్వాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం అంతా తిరిగేలా కవితకు అవకాశం ఇవ్వాలి అని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కుట్రలు కుతంత్రాలు జరిగాయి అని ఆయన ఆరోపించారు. బీజేపీ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది అని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాయ మాటలు చెప్పి గెలిచాడు అని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓడిపోలేదు అని అన్నారు. కాగా నేడు ఉదయం ఓట్ల లెక్కింపులో కవిత భారీ మెజారిటీ తో విజయం సాధించారు

Read more RELATED
Recommended to you

Latest news