CAAపై ఆందోళన చేసే వారిని చంపేయండి, బిజెపి ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు…!

-

కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ పౌరసత్వ సవరణ చట్టం కోసం ఉద్యమిస్తున్న వారిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని ఉద్దేశించి ఇళ్ళల్లోకి వెళ్లి రేప్ లు చేస్తారని వ్యాఖ్యానించారు.

మంగళవారం ప్రముఖ వార్తా సంస్థ ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజెపి ఎంపి మాట్లాడుతూ “లక్షలాది మంది ప్రజలు అక్కడకు చేరుకుంటారు ఢిల్లీ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వారు మీ ఇళ్లలోకి ప్రవేశిస్తారు, మీ సోదరీమణులు మరియు కుమార్తెలపై అత్యాచారం చేస్తారు, వారిని చంపండి. ఈ రోజు సమయం ఉంది, మోడీ జీ మరియు అమిత్ షా రేపు మిమ్మల్ని రక్షించడానికి రాలేరు. ”

ఢిల్లీ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం షాహీన్ బాగ్ నిరసనకారులను ఉద్దేశించి బిజెపి ఎంపి సోమవారం బహిరంగంగానే బెదిరించారు. ఢిల్లీ ఎన్నికలు చిన్నవి కావు దేశ స్థిరత్వం మరియు ఐక్యత కోసం. ఫిబ్రవరి 11 న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే, ఒక గంట తరువాత షాహీన్ బాగ్ లో ఎవరూ కనిపించరని పశ్చిమ ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక బిజెపి అధికారంలోకి రాగానే మసీదులు అన్నీ కూలుస్తా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news