సర్వేలపై లగడపాటి సంచలన నిర్ణయం..!

-

Lagadapati Rajagopal shocking decision on his surveys

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదివరకు తెలంగాణ ఎన్నికలపై సర్వే చెప్పి బొక్క బొర్లా పడ్డాడు కదా. అందుకే మళ్లీ అటువంటి పరిస్థితి రాకూడదని ముందే సర్దుకున్నాడు. ఇకపై వచ్చే ఎన్నికల్లో ఏ సర్వే చేసినా ఆ సర్వే ఫలితాలను ఎన్నికలు అయిపోయాకే ప్రకటిస్తాడట. ఎన్నికల ముందు అస్సలు ప్రకటించడట.

తెలంగాణలో చేసిన సర్వే బెడిసికొట్టినంత మాత్రాన సర్వేలు చేయడం తాను ఎన్నటికీ మాననని ఆయన స్పష్టం చేశాడు. కాకపోతే ఇక నుంచి సర్వే ఫలితాలను పోలింగ్ ముగిసిన తర్వాతనే వెల్లడిస్తానని లగడపాటి అన్నాడు. ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సర్వే చేసినప్పుడు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాతనే తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి మీడియాకు వెల్లడించాడు.

Read more RELATED
Recommended to you

Latest news