నా భార్య బాధ చూసి నాక్కూడా ఏడుపొచ్చింది : మల్లారెడ్డి

-

తన ఇళ్లు, కార్యాలయాలు, కుటుంబం, బంధువులు, సన్నిహితులపై జరిగిన ఐటీ దాడులపై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆదాయపన్న శాఖ ప్రక్రియ తనకు తెలుసని.. 2008లోనూ తమ ఇంట్లో తనిఖీలు చేశారని తెలిపారు. అప్పుడు సీజ్ చేసిన బంగారం ఇప్పటి వరకూ ఇవ్వలేదని చెప్పారు. తామేం తప్పు చేయలేదని.. ఐటీ దాడులు బాధాకరమని అన్నారు.

“నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్న విషయం తనిఖీలకు వచ్చిన అధికారులు చెప్పలేదు. కనీసం ఫోన్‌ చేసిన మాట్లాడించలేదు. నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్నట్లు టీవీలో చూసి తెలుసుకున్నాను. సమాచారం టీవీలో చూసి నా భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. నా భార్య బాధ చూసి నాకు కూడా కన్నీరు వచ్చింది. కుమారుడిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లనీయకపోవడంతో కోపం వచ్చింది.” అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

భవిష్యత్‌లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశముందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఏదైనా ఎదుర్కొనేందుకు కేసీఆర్ టీమ్ రెడీగా ఉందని చెప్పారు. ఎవరేం చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా భవిష్యత్‌లో అధికారం బీఆర్ఎస్‌దేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news