గవర్నర్ తమిళ్ సై బాబాయి కరోనాతో మృతి.. మోడీ సంతాపం !

-

కరోనా మహమ్మరి రోజురోజుకీ విజ్రుంభిస్తోంది. ఇప్పటికే దీని బారిన ఎంతో మంది నేతలు పడుతున్నారు. చాలా మంది ఈ వైరస్ బారిన పడి కోలుకుంటుంటే కొందరు మాత్రం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ బారిన పడి కాంగ్రెస్ ఎంపీ వసంత కుమార్ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణా గవర్నర్ తమిళ సైకి ఆయన బాబాయి. ఆయన వయసు 70 ఏళ్ళు, అయితే తమిళ్ సై బీజేపీలో ఉన్నా ఈయన సోదరుడు గతంలో తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేసారు. ఇక ఈయన వసంత అండ్ కో పేరిట ఆయన ఒక చైన్ సూపర్ మార్కెట్ లని కూడా నిర్వహిస్తున్నారు.

ఈయన మృతి చెందడంతో మోడీ తన సంతాపాన్ని తెలియచేశారు. లోక్ సభ ఎంపీ వసంత కుమార్ గారి మృతి బాధాకరమని ట్వీట్ చేశారు. వ్యాపారంలో అలానే సమాజ సేవలో ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మరువలేనివని ఆయన పేర్కొన్నారు. ఆయనతో కొన్ని సార్లు కలిసినప్పుడు ఆయనలో తమిళనాడుకు సేవ చేయాలని, దానిని అభివృద్ధి చేసుకోవాలనే తపన కనిపించిందని అన్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులకి, అనుచరులకి నా సంతాపం అని ఆయన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news