జగన్ కోడి కత్తి కేసు.. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు.. రహస్యంగా విచారించండి…!

-

NIA court instructed to investigate jagan kodi kathi case secretly

వైఎస్సాఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో జరిగిన దాడి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కోడి కత్తి కేసుపై ఎన్ఐఏ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ దర్యాప్తుపై తాజాగా ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులోని నిందితులు, న్యాయవాదుల సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు వెల్లడించింది. అయితే.. ఈ కేసును ఏపీ ప్రభుత్వం కావాలని తప్పుదోవ పట్టిస్తున్నదని.. అందుకే దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అప్పట్లో వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు జాతీయ సంస్థలకు ఈ కేసును అప్పగించవచ్చని తీర్పునిచ్చింది. దీంతో ఆ కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కోడి కత్తి కేసును ఎన్ఐఏకు అప్పగించమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానిపై ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ… హైకోర్టు మాత్రం ఈ కేసును ఎన్ఐఏకే అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం వాదనను తోసిపుచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news