టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ముగ్గురు ఉత్తరాంధ్ర నేతలు..? త్వరలో వైసీపీలోకి..!

-

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి. పైకి చెప్పుకోలేక.. లోపల దాచుకోలేక.. కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టీడీపీ నాయకులంతా వైసీపీలోకి ఎందుకు చేరుతున్నారో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు.

జాతీయ రాజకీయాలు దేవుడెరుగు.. ఉన్న ఏపీ కూడా పోయెట్టుందని దిగులు పట్టుకుంది బాబు అండ్ కోకు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే వైసీపీలో చేరారు. అనకాపల్లి ఎంపీ కూడా వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో పాటు మరో ఎంపీ, కొందరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతో పాటు మరికొందరు ఉత్తరాంధ్ర నాయకులు కూడా వైసీపీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కూడా వైసీపీ తీర్థం పుచుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కొంతమంది ఎంపీలు టీడీపీకి టచ్ లో లేకుండా పోయారట.

ఏతావాతా అర్థమయ్యేది ఏంటంటే… త్వరలోనే టీడీపీ ఖాళీ అయిపోతుంది. ముఖ్యమైన నేతలంతా వైసీపీలో చేరితే టీడీపీలో ఒక బాబు, ఆయన కొడుకు లోకేష్, నందమూరి బాలకృష్ణ.. అంతే ఒకరి మొహాలు ఇంకొకరు చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version