సిక్కోలుపై సీఎం చేస్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు: ప‌వ‌న్‌

-

తితిలీ తుఫానుకు అతలాకుత‌ల‌మైన సిక్కోలులో ప‌రిస్థితి అంతా దారి కొస్తుందంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు చేస్తున్న ప్ర‌చారానికి, వాస్త‌వ ప‌రిస్థితుల‌కు తేడా ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. సీఎం, మంత్రులు, వైసీపీ నేత‌ల‌తోపాటు రెండ్రోజులుగా పవన్ కల్యాణ్ కూడా సిక్కోలులో పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో పవన్‌కల్యాణ్‌ పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌… సిక్కోలు ప్రజలకు ఇప్పట్లో కావాల్సింది పాతిక కిలోల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంట్, మంచినీరు ఇచ్చేసి జిల్లాలో ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయని సీఎం చంద్ర‌బాబు బయట ప్రచారం చేస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version