నేడు నిర్మల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…

-

నేడు నిర్మల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డికి ఇది మొదటి జిల్లా పర్యటన విశేషం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్ లో ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ లో ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యా వసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపనున్నారు.

అలాగే అదిలాబాద్ లో కొండా సురేఖ, మంచిర్యాల లో సిరిసిల్ల రాజయ్య, కొమురం భీం జిల్లా లో అన్వేష్ రెడ్డిలు పర్యటించి…ఆయా జిల్లా కేంద్రాలలో ఎడ్ల బండ్ల ప్రదర్శన, సైకిల్ ర్యాలీలతో నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. కాగా… కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో… పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ దాటేశాయి పెట్రోల్ ధరలు. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 104.86 ఉండగా డీజిల్ లీటర్ ధర 97.96 గా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news