‘నా ప‌వ‌ర్ ఎంటో చూపిస్తా’ : కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్ కోమటిరెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఎంపీ కోమ‌టి రెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియ‌మించిన విషయం తెలిసిందే. అధిష్టానం ప్ర‌క‌ట‌నపై ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి స్పందించారు. త‌న‌పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూపిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి త‌న ప‌వ‌ర్ ఎంటో చూపిస్తాన‌ని అన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై పోరాటం చేస్తాన‌ని అన్నారు.

komatireddy venkatreddy

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డ‌తామ‌ని తెలిపారు. షేక్ పేట్ లో రూ. 2,000 కోట్ల ప్ర‌భుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రైవేటు వ్య‌క్తుల‌కు ఇస్తుంద‌ని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న విధానాల‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఫుల్ ఫోక‌స్ పెట్టార‌ని తెలిపారు. రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి త్వ‌ర‌లోనే రాష్ట్రానికి వ‌స్తార‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news