సైలెంట్ అయిన కొడాలి నాని.. అస‌లు కార‌ణం ఇదా!

-

ఏపీ రాజ‌కీయాల్లో కొడాలి నాని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వైసీపికి ఆయ‌న ప్ర‌ధాన బ‌లం. జ‌గ‌న్ కు న‌మ్మిన బంటు. మాస్‌లీడ‌ర్‌గా పేరున్న ఆయ‌న ఎప్పుడూ త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడుగా ఉంటారు. అయితే ఆయ న గ‌త కొద్ది కాలంగా సైలెంట్ అయ్యారు. జ‌గ‌న్ ను ఒక్క మాట అన్నా ఒంటికాలుపై లేచే మంత్రి కొడాలి నాని ఇప్పుడు మౌనం వ‌హించారు.

 

అయిన కొడాలి నాని త‌న నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప‌రిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంత్రికి కొన్ని ఇబ్బందులు వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

త‌న నియోజకవర్గంలో అన్నదానం చేయ‌డానికి నాని రెడీ అయ్యారు. క‌రోనా తీవ్ర‌త ఇలాగే ఉంటే వచ్చే నెల 3 నుంచి ఆయా మండలాల్లో అన్న‌దానం చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారుల సాయంతో ఈ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకెళ్తున్న‌ట్టు స‌మాచారం. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్పటికప్పుడు తన వంతుగా సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news