వైఎస్సార్‌ నరరూప రాక్షసుడు : మరో తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వెనుకబాటు తనానికి దివంగత సీఎం వైస్‌ రాజశేఖర్‌ రెడ్డే కారణమని… ఆయన నరరూప రాక్షసుడని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణలోని భూములను, ఆస్తులను దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ కేసులతో అమయకులను వేధించారని.. గ్రూప్‌ -1 పోస్టుల విషయంలోనూ అన్యాయం చేశారని ఫైర్‌ అయ్యారు. దొంగను దొంగ అనకుండా దొర అంటారా ? అని ప్రశ్నించారు.

ఏపీతో మంచిగా ఉండాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నా.. జగన్‌ మాత్రం అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. పాలమూరు జిల్లా నాశనం కావడానికి, 14 లక్షల మంది వలస వెళ్లడానికి వైస్‌ రాజశేఖర్‌ రెడ్డియే కారణమని ఫైర్‌ అయ్యారు. పోతిరెడ్డి పాడును 40 వేల క్యూసెక్కులకు విస్తరించి, పక్కనే ఉన్న మహబూబ్‌ నగర్‌ జిల్లాకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారని.. తెలంగాణ అధికారులను ఏపీలో ఇబ్బందులకు గురి చేశారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news