కూతుర్లను లండన్ నుంచి పిలిపించిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… తన కుమార్తెలను లండన్ నుంచి వచ్చేయాలని కోరారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో వారిని ఇక్కడికి రావాలని సూచించారు. ఆయన ఇద్దరు కూతుళ్ళు లండన్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పారాసిటమాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ చల్లితే కరోనా చచ్చిపోతుందని వైఎస్ జగన్ సెలవిచ్చారు.

అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ తన ఇద్దరు కూతుళ్లను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు…? రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడ్డా ఫర్వాలేదు గానీ, జగన్ కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనాకి ఇంత స్వార్థమా? అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇటీవల జగన్ మీడియా తో మాట్లాడుతూ బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా పోతుందని చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news